*ఆర్టీసీ బస్సు ఛార్జీలపెంపుపై నిరసన కు బీజేపీ పిలుపు
*బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గృహనిర్బంధం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించి పటిష్ఠ బందో బస్తు నిర్వహించారు.
డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు.. అందులో భాగంగా సంజయ్ జేబీఎస్లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు
ఈ క్రమంలో బండి సంజయ్ జేబీఎస్కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. ముందుగా బండి సంజయ్ను గృహనిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించాయి.
ప్రజల తరఫున పోరాడే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఛార్జీల పెంపుపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల బాధలు తెలుసుకోవడం నేరమా?, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు.
అరెస్టులు, అణిచివేతలతో ఉద్యమాలను ఆపలేరు అంటూ పోలీసులపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రయత్నాలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా.. బస్సు ఛార్జీల పెంపుపై ఇవాళ ధర్నాలు చేసి తీరతామని భాజపా నేతలు స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్రెడ్డి