telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నారు…

బీజేపీ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసిన శ్రీనివాస్ ను పరామర్శించారు బీజేపీ నేతలు. ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రశ్నించే వారిపై  ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి.. జైళ్ళకు పంపుతోంది. అయిన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడతాం అని తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించే వరకు కష్టపడి పనిచేద్దాం… కార్యకర్తలు ధైర్యంగా ఉండండి అని అన్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం బాధాకరం… పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. శ్రీనివాస్ కు 58శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు అని బండి సంజయ్ అన్నారు. అయితే ఈ రోజు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు శ్రీనివాస్ ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్…బండి సంజయ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ ఆత్మహత్య పాల్పడ్డాడు. ABVPలో మొదటి నుంచి చురుకైన కార్యకర్త. బిసి యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తి.   హైదరాబాద్ లో నెట్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్.. లాక్ డౌన్ తరువాత ఇంటి దగ్గరే ఉంటున్నాడు. సిద్దిపేట దగ్గర బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడంతో బాధ గురైయ్యాడు. దీంతో పార్టీ ఆఫీస్‌ దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Related posts