telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

అడ్వకేట్ హత్యా వెనుక ప్రభూత్వమే ఉంది : బండి

మంథిని లో తెరాస గూండాలే  నిజాయితీ పరులు అయిన అడ్వకేట్ దంపతులు గట్టు వామన రావు ఆయన భార్యను హత్య చేశారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కొందరు పోలీస్ అధికారులతో ప్రభుత్వమే ఈ హత్యలు చేయించింది. ప్రభుత్వ పెద్దలకు చెందిన అవినీతి చిట్టా అడ్వకేట్ వామనరావు దగ్గరుంది. అడ్వకేట్ దంపతులను హత్య చేసి టీఆర్ఎస్ గుండాలు కేసీఆర్ కు పుట్టినరోజు బహుమానం ఇచ్చారు. అడ్వకేట్ దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేయటమే అడ్వకేట్ దంపతుల హత్యకు కారణం అని పేర్కొన్నారు. లాకప్ డెత్ సహా.. అనేక అక్రమాలపై వామనరావు హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. వామనరావుకు రక్షణ కల్పించమన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రశ్నించే గొంతుకు రాష్ట్రంలో స్థానం‌ లేదని వామనరావు హత్య ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. అడ్వకేట్ దంపతుల హత్యపై ముఖ్యమంత్రి స్పందించాలి. అడ్వకేట్ల ఆందోళనకు బీజేపీ మద్దతు ఉంటోంది. న్యాయం చేసే వాళ్ళకే ఈ రాష్ట్రంలో న్యాయం లేకుండా పోయింది. న్యాయం చేసే వాళ్ళనే హత్య చేశారు. మాకు ప్రాణ హాని ఉందని కూడా పలు మార్లు ప్రభుత్వం కు చెప్పారు. ఇందులో తెరాస పెద్దలు ,ప్రభుత్వ  హస్తం ఉన్నది. పెద్ద కేసును చిన్న కేసుగా ప్రయత్నాలూ చేసే అవకాశాలు ఉన్నాయి. అడ్వకేట్ లకు విజ్ఞప్తి చేస్తున్న మీరు ఈ హత్యా పై స్పందించాలి అని బండి తెలిపారు.

Related posts