telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కెసిఆర్ కు బండి సంజయ్ కౌంటర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ని తప్పకుండా టచ్ చేసి చూపిస్తామన్నారు.. . ఈ రోజు యుద్దం మొదలుపెట్టాం అంటూ కౌంటర్ ఇచ్చారు. గత ఏడేళ్లుగా తెలంగాణ లో రైతుల వడ్లు కోనుగోలు చేసింది కేంద్రం కాదా..? అని ప్రశ్నించారు. కేంద్రమే కొనుగోలు చేసి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

‘నీకు కోపం వస్తే నీ కార్యకర్తలు భయపడుతారేమో.. కానీ బీజేపీ భయపడదని’ హెచ్చరించారు. దేశంలో 22 రాష్ట్రాలు పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గించాయి.. మరి నువ్వేందుకు తగ్గించవని ప్రశ్నించారు. మొత్తం తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు బండి సంజయ్.

Related posts