telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజ…

సీఎం కేసీఆర్ కులాల చిచ్చు పెడుతున్నాడని, కోటిలో ధర్నా చేస్తున్న స్టాఫ్ నర్సులపై లాఠీఛార్జ్ అమానుషం అని బండి సంజయ్ అన్నారు. స్టాఫ్ నర్సుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్న ఆయన సీఎం కేసీఆర్ కాళేశ్వరం వచ్చింది శనిపూజ కోసమేనని అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజ చేసి ఆ ద్రవ్యాలను త్రివేణి సంఘంలో కలిపారని ఆయన అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకే కాకా పర్యటన చేశారని అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి ఐతే ఆటమ్ బాంబ్ కాదు రాష్ట్రంలో అణుబాంబ్ పేలుతుందన్న ఆయన రక్తపు మడుగులో రాజ్యం ఏలుతున్న కేసీఆర్ తో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో పొత్తుపెట్టుకోదని అన్నారు. కేసీఆర్ పై అసహనంతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే కేటీఆర్ ముఖ్యమంత్రి పేరుతో కొత్త డ్రామా అని ఆయన అన్నారు. కెటిఆర్ ముఖ్యమంత్రి కావడాన్ని టిఆర్ఎస్ లోని చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వ్యతిరేకిస్తున్నారన్న ఆయన కాంగ్రెస్ – టీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. అందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఎవరికీ నష్టం లేదన్న ఆయన రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి దిగిరావడం సంతోషంగా ఉందని అన్నారు.

Related posts