telugu navyamedia
తెలంగాణ వార్తలు

18.90 లక్షలు పలికిన బాలాపూర్‌ లడ్డూ

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019లో రూ.17.60 లక్షలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు.

వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్‌ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 450 రూపాయలకు బాలాపూర్ లడ్డు సొంతం చేసుకున్నారు
కొలను మోహన్ రెడ్డి. 2019 లో కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డు ను సో0తం చేసుకున్నారు.

కొవిడ్‌ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసిందే. మరోవైపు భజన బృందం, డప్పు చప్పుళ్ల సందడి నడుమ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. బాలాపూర్‌ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహిస్తున్నారు.

Related posts