తెలుగువాడి వాడి, వేడిని ప్రపంచానికి చాటిన మహా నాయకులు ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ 98వ జయంతి నేడు. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇప్పటికే పలువురు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ..ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని.. ఆయన స్పూర్తి తనను నడిపిస్తోంది పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని..తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితం పై నేనే పుస్తకం రాస్తానని…ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య అంశాల్లో చేర్చాలని తెలిపారు. ఆయుర్వేదంపై నాకు పూర్తి నమ్మకం వుందని కూడా బాలకృష్ణ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ రైతుల పార్టీ, కార్మికుల పార్టీ అని పేర్కొన్నారు. ఏపీలో నియంతృత్వ పాలనకు అంతం పలకాలని తెలిపారు. పెడవాది రక్తంలోంచి టిడిపి పుట్టిందని బాలయ్య వెల్లడించారు.
హేమ వ్యాఖ్యలపై శ్వేతారెడ్డి ఫైర్… మీలాంటి వారికి అలవాటేమో…