హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ – వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు .
అయితే కొందరు పేషెంట్లు ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని.. ప్రైవేటు క్లీనిక్ లకు వెళ్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు రోజుల క్రితం తమ బిడ్డ చనిపోయిందని బాలక్రిష్ణకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాటుతూ.. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని ఫైర్ అయ్యారు.
గత ప్రభుత్వ హాయంలో వ్తెద్య సేవల కోసం తెచ్చిన వ్తెద్య పరికరాలు వాడకుండా మూలన పడివేశారని మండిపడ్డారు బాలకృష్ణ. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై జిల్లా వ్తెద్యఆరోగ్య శాఖ అధికారి, కలెక్టర్కు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.