టీడీపీ అధినేత చంద్రబాబు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్కు షాకిచ్చారు. అమలాపురం లోక్సభ స్థానానికి హర్షకుమార్ పేరును ప్రకటించే అవకాశం ఉందని గత రెండు మూడు రోజులుగా వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఆయనతో టీడీపీ నేతలు చర్చలు కూడా జరిపినట్టు వార్తలు హల్చల్ చేశాయి. చివరి నిమిషంలో చంద్రబాబు తన మనసు మార్చుకున్నారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీనితో హర్షకుమార్ భవితవ్యం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు దాదాపు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో హర్షకుమార్ అడుగులు ఎటువైపు పడతాయన్నది చూడాలి. ఇక ముందుగా ఊహించినట్టే ఎంవీవీఎస్ మూర్తి మనవడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్కు విశాఖ, మురళీమోహన్ కోడలు రూపకు రాజమండ్రి సీట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీల్లో పదిమంది తిరిగి బరిలోకి దిగబోతున్నారు.
పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించా : పవన్ కళ్యాణ్