టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అభిమానులనైనా సరే.. చిరాకు వచ్చే.. అలవోకగా ఆయన నోటి వెంట బూతులు ధారాళంగా వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు బాలయ్య బూతులే హాట్ టాపిక్ అంటే అతిశయోక్తి కాదు. పీకకోస్తా.. వేసేస్తా.. నా కొడకా.. పగలిపోద్ది.. నరుకుతా.. ఇలాంటి డైలాగులు బాలయ్య ప్రచారంలో నిత్యకృత్యంగా మారాయి. పాపం.. బాలయ్యకు అడ్డు చెప్పేవారే లేకపోవడంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా దూపురంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద కూడా ఆయన తన మార్కు చూపించారు.
పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఉద్యోగులు బారులు తీరి ఓటింగ్ వేస్తుంటే.. నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ, పెద్దసంఖ్యలో పార్టీనాయకులతో కలిసి వచ్చారు. నేరుగా ఉద్యోగుల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. సెల్ఫీలు తీసుకుని వారితో కరచాలనం చేస్తూ సహకరించాలని చెప్పుకుంటూ వెళ్లసాగారు. నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయకూడదు.. ఇదే విషయాన్ని దళిత సంఘం నాయకుడు ఉదయ్, ఇతర నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవచ్చా ..? అని నిలదీశారు. దీనితో బాలకృష్ణ మళ్లీ నోటికి పని చెప్పారు. తన మార్కు డైలాగులతో చెడుగుడు ఆడుకున్నారు. ” ఆ.. ఎవడొచ్చాడిక్కడ.. పగులుద్ది” అంటూ ఇస్తూ మరోకౌంటర్ వద్దకు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు ప్రశ్నించిన తమపై నోరుపారేసుకున్న బాలయ్య తీరుకు నిరసనగా ఉదయ్, మరికొందరు దళితనాయకులు ఆందోళనకు దిగారు.
నా గురించి దేవేగౌడ అసత్యాలు మాట్లాడారు: సిద్ధరామయ్య ఫైర్