ప్రేమికుల రోజున జంటనగరాల్లో భజరంగ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రేమికుల దినోత్సవాన్ని నిరసిస్తూ ప్రేమజంటలకు చుక్కలు చూపించారు. నానా హంగామా చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. పార్కులన్నీ కలియతిరుగుతూ అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే చాలు పెళ్లిళ్లు చేయడానికి పూనుకున్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కులో కంటపడిన ఓ ప్రేమజంటకు అక్కడినే పెళ్లి జరిపించేశారు. పార్కులో అందరూ చూస్తుండగానే అబ్బాయి చేత అమ్మాయి మెడలో తాళి కట్టించేశారు. సెల్ఫోన్లో చిత్రీకరించిన ఈ దృశ్యాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
దీనిని ముందే ఊహించిన అధికారులు వాలెంటెన్స్ డే సందర్భంగా పార్కుల వద్ద పోలీసులు మోహరించారు. ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటామన్న వీహెచ్పీ, భజరంగ దళ్ కార్యకర్తల హెచ్చరికల నేపథ్యంలో సంజీవయ్యపార్క్, ఇందిరాపార్కు, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో పోలీసుల మోహరించారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసినా ఆక్సిజన్ పార్కులో మాత్రం ప్రేమజంటకు పెళ్లి చేయకుండా ఆపలేకపోయారు.
నేడు ఇలాంటిది ఏదో జరుగుతుందనే షీ టీం లను కూడా మోహరించారు అధికారులు. అయినా నిరసన కారులు రెచ్చిపోవటం విశేషం.
https://www.facebook.com/oneindiatelugu/videos/257332031834283/
video source : oneindiatelugu
ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం సౌకర్యంగా ఉంటుంది : శ్రియ