ప్రముఖ కంపెనీ బజాజ్ మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మన జేబులో నుంచి వాలెట్ లేదా పర్స్ దొంగలించబడ్డప్పుడు ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాలెట్ను మనం కోల్పోయిన, ఎవరైనా కొట్టేసిన పరిస్థితి కూడా చాలా మందికి ఎదరయ్యే ఉంటుంది. పర్స్ పోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వాలెట్లో డబ్బులతోపాటు విలువైన కార్డులు కూడా ఉంటాయి. పర్స్ పోయినప్పుడు చాలామంది ఇబ్బందులకు గురవుతారు. కార్డులను బ్లాక్ చేయడానికి బ్యాంకులకు కాల్ చేస్తారు. అలాగే కొత్త కార్డుల కోసం మళ్లీ దరఖాస్తూ చేసుకుంటారు.
ఇక జేబులో నుంచి పర్స్ పోయిందంటే మొత్తంగా నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్లినప్పుడు వాలెట్ పోతే మాత్రం నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే బజాజ్ ఫిన్సర్వ్కు చెందిన బజాజ్ ఫైనాన్స్ వాలెట్ కేర్ పేరుతో సరికొత్త సర్వీసులు లాంచ్ చేసింది. బజాజ్ వాలెట్ కేర్ సేవలతో మీ వాలెట్కు ప్రొటెక్షన్ లభిస్తుంది. రూ.599 పెట్టి ఈ వాలెట్ కేర్ ప్లాన్ తీసుకుంటే పర్స్ పోయినప్పుడు మీకు రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అంతేకాకుండా ట్రావెల్, హోటల్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా పొందవచ్చు.
జగన్ కేబినెట్ లో రోజాకు స్థానం కలిపిస్తే బాగుండేది: విజయశాంతి