telugu navyamedia
క్రీడలు వార్తలు

కరోనా రూల్స్ బ్రేక్ చేసిన బాబర్ అజామ్…

బాబర్ అజామ్ కరోనా రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. అయితే కరోనా వైరస్ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన పాకిస్తాన్ జట్టు సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కానీ తాజాగా ఓ పనిపైన తన సొంత కారులో బాబర్ అజామ్ వెళ్లాడు. బాబర్ వెళ్లిన విషయాన్ని తెలుసుకుని మీడియా వెళ్లగా.. విషయం తెలుసుకున్న పాక్ కెప్టెన్ మీటింగ్ హుటాహుటిన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లకి మంగళవారమే పీసీబీ పర్యవేక్షణలో మొదటి కరోనా వైరస్ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇంతలోనే బాబర్ అజామ్.. పీసీబీ ఆదేశాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశమైంది. టీమ్ ఎంపికపై ఇటీవల అసహనం వ్యక్తం చేసిన బాబర్‌పై.. ఇప్పటికే పీసీబీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు పీసీబీ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంతో.. అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాబర్ అజామ్ చివరగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2021లో కరాచీ కింగ్స్ తరఫున ఆడాడు. పీఎస్ఎల్ 2021 మొదలైన కొన్ని రోజుల తర్వాత కరోనా కేసులు నమోదవడంతో టోర్నీని మధ్యలోనే వాయిదా వేశారు.

Related posts