భారతదేశం గర్వించదగ్గ చిత్రం “బాహుబలి-2”. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. “బాహుబలి” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల వసూళ్ళని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విడుదలై మూడేళ్ళు అవుతున్నప్పటికీ, ఆ మేనియా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాలు కేవలం ఒక్క తెలుగులోనే కాకుండా మొత్తం భారతదేశ అన్ని భాషల్లోనూ ఆల్ టైం రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. మరి అలాంటి ఈ ఎపిక్ విజువల్ వండర్ ఇప్పుడు మన దేశంలో మళ్ళీ రీ రిలీజ్ కావడానికి రెడీగా ఉందట. మొదటగా “బాహుబలి ది బిగినింగ్” ఈ శుక్రవారం విడుదల కానుండగా “బాహుబలి ది కంక్లూషన్” ఆ వచ్చే శుక్రవారం ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని సిటీస్ లో విడుదల చేయనున్నారట. లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ భారీ ఎపిక్ వండర్స్ థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇప్పటికే యూఎస్ లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే.
previous post