telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Saachi

2020 చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఒక‌ప‌క్క క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ ఆగిపోయాయి. సినీ ప‌రిశ్ర‌మ గ‌డ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. ఈ ప‌రిస్థితుల్లో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదాలు జ‌రుగుతున్నాయి. కొన్ని గంటల క్రిత‌మే మ‌ల‌యాళ ద‌ర్శ‌క నిర్మాత కె.స‌చిదానంద్‌ (స‌చి) గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈయ‌న వ‌య‌సు 48 సంవ‌త్స‌రాలు. ఆర్థోపెడిక్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు హిప్ రీప్లేస్‌మెంట్ ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఆప‌రేష‌న్ త‌ర్వాత గుండెపోటు రావ‌డంతో స‌చీని త్రిచూర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వెంటిలేట‌ర్ స‌హాయంతో చికిత్స పొందుతూ స‌చి క‌న్నుమూశారు. ద‌ర్శ‌క నిర్మాత‌గా స‌చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గ‌త ఏడాది ఈయ‌న తెర‌కెక్కించిన ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. దీన్ని ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌చి మ‌ర‌ణంపై ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Related posts