telugu navyamedia
క్రీడలు వార్తలు

ముగిసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్…

మేతేరా వేదికగా భారత్ తో జరుగుతున్న చివరి టెస్టులో మొదట బేటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. 205 పరుగులకే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అంత పెవిలియన్ చేరుకున్నారు. అయితే మొదట ఓపెనర్లను ఇద్దర్ని పెవిలియన్ కు చేర్చి ఇంగ్లాండ్ పతనాన్ని అక్షర్ పటేల్ ప్రారంభించాడు. ఆ తర్వాత కెప్టెన్ రూట్ వికెట్ తీసి ఆ జట్టును కష్టాలో పడేసాడు సిరాజ్. కానీ ఆ తర్వాత అర్ధశతకం చేసి జట్టును గాడీలోకి తెస్తున్న అల రౌండర్ బెన్ స్టోక్స్ ను సుందర్ పెవిలియస్న్ కు చేర్చడంతో ఆ జట్టు మళ్ళీ కష్టాలో కురుకపోయింది. ఆ తర్వాత మళ్ళీ వారిని తేరుకోనివ్వకుండా వరుసగా రెండు వికెట్లు తీసాడు అశ్విన్. చివరి క్షణాల్లో మరోసారో ఫామ్ లోకి వచ్చిన అక్షర్ పటేల్ ఒక్కే ఓవర్లో ఇద్దర్ని వెనక్కి పంపాడు. ఇక జాక్ లీచ్ రూపంలో చివరి వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్. అయితే ఈ మ్యాచ్ లో మొత్తం అక్షర్ నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు తీయగా సుంద ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 14 ఓవర్లు ఉండటంతో భారత్ తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

Related posts