*సికింద్రాబాద్ విధ్వంసం కేసు
*అల్లర్ల వెనుక అసలు సూత్రదారి సుబ్బారావే..
*బోడుప్పల్లో ఉన్న హోటల్లో విధ్వంసాని కుట్ర..
*అల్లర్ల కోసం సుబ్బారావు 35వేలు ఖర్చు..
*సుబ్బారావుతో పాటు శివ, మల్లారెడ్డి, బీసీ రెడ్డి అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్లో అల్లర్లకు ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావును సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన కుట్రదారుగా తేల్చారు. అందుకే ఆయన్ని కొన్ని రోజల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి విచారించి ఇవాళ అరెస్టు చూపించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుబ్బారావుతో పాటు ఈ అల్లర్లతో ప్రమేయమున్న అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
వీరిని పలుమార్లు ప్రశ్నించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. విధ్వంసం సృష్టించాలని యువతను రెచ్చగొట్టినట్లు నిర్ధారించారు. పక్కా ప్రణాళిక ప్రకారం అల్లర్లకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు.. చివరికి రైల్వేస్టేషన్లో విధ్వంసం జరగడానికి మూలకారణం సుబ్బారావేనని తేల్చారు.
విచారణ ముగియటంతో.. సుబ్బారావుకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని పోలీసులు రైల్వేకోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో సుబ్బారావుకు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రైల్వే కోర్టు నుంచి ఈ నలుగురు నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది