telugu navyamedia
సినిమా వార్తలు

భారత్‌లో “అవెంజర్స్: ఎండ్‌గేమ్” రికార్డులు… తొక్కిసలాటలో యువతికి గాయం 

Avengers-4
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హాలీవుడ్ మూవీ “అవెంజర్స్: ఎండ్ గేమ్” భారత్‌లో రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,186 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా భారత్‌లోనూ వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకున్న అవెంజర్స్.. వారాంతానికి రూ.150 కోట్లు దాటేసింది. ఇక భారత్‌లోనూ ఈ సినిమాకు జనాలు భారీగా పోటెత్తుతున్నారు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని సినీపోలిస్ ఫోరం శాంతినికేతన్‌లో రాత్రి 10 గంటల షోకు వెళ్లిన 32 ఏళ్ల మహిళ తీవ్ర గాయాలపాలైంది. థియేటర్‌లోకి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా తోపులాట జరగడంతో మహిళ కిందపడిపోయింది. సినిమా ప్రదర్శనకు మూడు నిమిషాల ముందే థియేటర్ తలుపులు తెరుచుకోవడంతో జనాలు ఒక్కసారిగా హాల్‌లోకి పరుగులు తీశారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆమె మెట్ల వద్ద కిందపడి పెదవులు చిట్లిపోయాయని, పళ్లు విరిగాయని, కిందపడిన ఆమెకు సాయం అందించేందుకు థియేటర్ యాజమాన్యం ముందుకు రాలేదని, దీంతో తానే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు గాయపడిన యువతి స్నేహితురాలు ఖైజర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు.

Related posts