2009లో “అవతార్” సినిమాను అద్భుతమైన గ్రాఫిక్స్తో మరో ప్రపంచాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. దీంతో అతని పేరు వరల్డ్ వైడ్ ఒక్కసారిగా మారు మోగింది. అలాంటి అద్భుత సృష్టి అయిన అవతార్ సినిమాకు సంబంధించి సీక్వెల్స్ రూపొందుతున్న పనిలో పడ్డాడు కామెరూన్. లాక్డౌన్ వలన సీక్వెల్ పనులకి బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుండడంతో అవతార్ సీక్వెల్ పనులు మొదలు పెట్టారు జేమ్స్ కామెరూన్. ఇందుకోసం 50 మంది క్రూతో కలిసి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో కొద్ది రోజుల క్రితం న్యూజీలాండ్ చేరుకొన్నారు జేమ్స్ కామెరూన్. అయితే వెల్లింగ్టన్ చేరుకోగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జేమ్స్ కామెరూన్తో పాటు క్రూ సభ్యులంతా 14 రోజుల సెల్ఫ్ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. దీంతో వారంతా కరోనా టెస్టులు సైతం చేయించుకున్నారు. అయితే అందరికి కరోనా పరీక్షలలో నెగెటివ్ రావడంతో తాజాగా అవతార్ 2 షూటింగ్ మొదలు పెట్టారు. స్టోన్ స్ట్రీట్ స్టూడియోలో సోమవారం షూటింగ్ మొదలైన విషయాన్ని వెల్లడిస్తూ స్పాట్లో తీసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిర్మాత జోన్ ల్యాండ్. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా అవతార్ 2,3,4,5 పార్ట్లు రూపొందుతున్నాయి. అవతార్ 2 చిత్రాన్ని డిసెంబర్ 17, 2021న విడుదల చేయనున్నట్టు ఆ మధ్య కామెరూన్ ప్రకటించారు. కాని షూటింగ్కి కొద్ది రోజుల పాటు బ్రేక్ పడడం వలన రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది.
View this post on Instagram
Used my iPhone to snap a picture of our first shot back in production on the Avatar sequels.