విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా ఐదో రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు, నిర్వాసిత గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజలు తరపున లేఖ రాశారని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందని.. విభజన చట్టం హామీలు అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ ను, ఉక్కు మంత్రిని ఎంపి విజయసాయిరెడ్డి కలిశారని.. కార్మిక సంఘ నాయకుల్ని ఢిల్లీకి తీసుకువెళ్తామన్నారు. ప్రజలు యొక్క సెంటిమెంట్ ను కేంద్రం గౌరవించకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రధానులు ఉన్న సమయంలో ప్రైవేటు చేయాలి అనుకుంటే అప్పట్లో వ్యతిరేకించామని…దక్షిణాది రాష్ట్ర ప్రజలు అంటే గౌరవం ఇవ్వరా? అని నిలదీశారు. కొందరు అమరావతి ఉద్యమంతో ముడిపెడుతున్నారని ఇది సరికాదన్నారు. ప్రభుత్వం పరంగా మా వైపున పోరాటం చేస్తున్నామని… కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాం, అందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేది అవాస్తవమని తెలిపారు. ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, రాష్ట్రంలో ఏ ఒక్కరు అంగీకరించరని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు లేఖ స్పష్టంగా రాయాలి, ప్రతి విషయం రాజకీయం చేయడం మానుకోవాలని హితువు పలికారు. రేపు ఉదయం 8 గంటలకు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నిరసన చేపడతామని పేర్కొన్నారు.
previous post
విశాల్ నన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగారు… కానీ…!