telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆక్లండ్ మ్యాచ్ .. భారత్ చేతికే..

auckland match favour to india

ఆక్లాండ్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో మనవాళ్ళు గెలుపువైపు పరుగులు తీస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిధ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గ్రాండ్ హోమ్ 28 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్ 36 బంతుల్లో 42 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో మన్రో 12, విలియంసన్ 20, మిచెల్ 1, శాంట్నర్ 7, సౌథీ 3 పరుగులు చేయగా… కుగ్లీన్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత బౌలర్లలో కృణాల్ పాండ్యా 3, అహ్మద్ 2 వికెట్లు తీయగా… భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 159 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ను ఆరంభించింది. రోహిత్ శర్మ, ధావన్ లు భారత ఇన్నింగ్స్ ను ఆరంభించారు. కేవలం 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను పంత్, ధోనీలు రెట్టించి ఆడటంతో విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలే ఉంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే, వారికే టీ20 సిరీస్ దక్కనుంది. దీనితో ఈ ఆఖరి మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళా టీం కూడా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్నారు.

Related posts