హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ వెళ్లిన సినీనటిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడి చేసి, ఆమె వద్ద ఉన్న సెల్ ఐఫోన్ ఫోన్ లాక్కేల్లాడు. దుండగుడుతో పెనుగులాటలో నటి చౌరాసియా ముఖంపై, తలకు, కాళ్లకు గాయాలయ్యాయి.
వెంటనే తేరుకున్న చౌరాసియా డయల్ 100 కి సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేస్తున్నారు
ఈ ఘటన ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో చౌరాసియా కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ వెళ్లింది. ఒంటరిగా ఉన్న తనపై ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు, ఈ క్రమంలో తన ముఖంపై పిడిగుద్దులతో గుద్ది, బండరాయితో ఆమెపై దాడి చేసే యత్నం చేశాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేబీఆర్ పార్క్ లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి. సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు సైతం వాకింగ్, జాగింగ్ చేయడానికి కేబీఆర్ పార్క్ కు వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పోలీసులు కూడా కాపలా కాస్తూ ఉంటారు.
అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!