telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు . 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 50,654 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది.

13 రౌండ్ ముగిసేసరికి ఫలితాలు..
విక్రమ్ రెడ్డి (వైసీపీ) -54,448
భరత్ కుమార్ (బీజేపీ)- 12202

ఇదిలా ఉంటే.. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది.

Related posts