టీడీపీ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం కోర్టు అచ్చెన్నకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిలు పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన అచ్చెన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అచ్చెన్న స్వీకరించారు.