telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్న బెయిల్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు

Atchannaidu tdp

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. వచ్చే శుక్రవారం బెయిల్ పై తీర్పు వెలువరించనుంది.

ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరి గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారులు వాదించారు. కరోనా బారినపడిన అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Related posts