telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షాకు దమ్ముంటే సీఏఏ పై నాతో మాట్లాడాలి: ఒవైసీ సవాలు

asaduddin owisi

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో కాదని, అమిత్ షాకు దమ్ముంటే తనతో మాట్లాడాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ తాను తియ్యని హల్వాలాంటి వాడిని కాదని, ఎర్రని కారంలాంటి వాడినని అన్నారు.

సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు ఈ ఎన్నికలు రెఫరెండం కాదన్నారు.ముస్లింలు ఆపదలో ఉన్నప్పుడు ఏ లౌకిక పార్టీ పరామర్శించేందుకు రాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కొన్ని టీవీ చానళ్లు తన పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వహించి టీఆర్పీలు పెంచుకుంటున్నాయని ఒవైసీ పేర్కొన్నారు.

Related posts