telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోలీసుల ట్వీట్ పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్!

asaduddin owisi

హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతం సుప్రసిద్ధ పర్యాటక స్థలం. అక్కడ (ఆర్ ఏ ఎఫ్) ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండపడ్డారు. మహిళా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు చార్మినార్ వద్ద మార్చ్ చేస్తున్న దృశ్యాన్ని హైదరాబాద్ నగర పోలీసులు ట్వీట్ చేశారు.

పోలీసుల ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ, కేవలం చార్మినార్ వద్దే ఎందుకు మార్చ్ నిర్వహించారని నిలదీశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద, హైటెక్ సిటీ వద్ద, లేకపోతే నగరంలోని అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీల వద్ద ఎందుకు ఇలా చేయలేదని ప్రశ్నించారు.

Related posts