telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ కు విలన్ గా తమిళ హీరో…?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు ‘ఓ డియర్’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ లో ఒకదానిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్ర బృందం జార్జియాలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు రూ.400 కోట్లతో భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా తారాగణం విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన విలన్ పాత్రను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. తమిళ హీరో అరవింద్ స్వామిని ఖరారు చేశారని అంటున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి అయితేనే విలన్ పాత్రకు బాగుంటారని భావించి నాగ్ అశ్విన్ ఆయన్ని సంప్రదించారట. ఒకప్పుడు హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అరవింద్ స్వామి.. ఇప్పుడు విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో విలన్‌గా నటించారు.

Related posts