ఉల్లి ధర ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఢిల్లీ వాసులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. మార్కెట్ రేటుతో పోలిస్తే సగానికే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి కిలో ఉల్లిపాయలను రూ.23.90కే విక్రయించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
రాష్ట్రంలోని 400 రేషన్ షాపులతోపాటు 70 మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం రానున్న 5 రోజుల్లో కేంద్రం నుంచి సుమారు లక్ష కిలోల ఉల్లిపాయలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని పరిమితులతో మాత్రమే వీటిని కొనుగోలు చేయగలరు. ఒక వ్యక్తికి ఒకసారి కేవలం 5 కిలోల ఉల్లిపాయలను మాత్రమే విక్రయించనున్నట్లు చెప్పారు.
చైనాకు తగిన శాస్తి జరగాలి: మధ్యప్రదేశ్ సీఎం