telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బస్సులు పునరుద్ధరించాలన్న ఆలోచనలో తెలుగు రాష్ట్రాలు!

rtc protest started with arrest

కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి బస్సులు పునరుద్ధరించాలన్న ఆలోచనలో తెలుగు రాష్ట్రాలు సంసిద్దమవుతున్నాయి. సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.12 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరుగుతున్నాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ వచ్చింది. తాము 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని ఈ లేఖలో ప్రతిపాదించారు. దీనిపై వెంటనే చర్చించి, బస్సులను నడిపిద్దామని ఈ లేఖలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారు.

Related posts