మరోసారి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించింది. ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ ఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. 46 డిమాండ్లతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఈ నోటీసు ఇచ్చింది. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది.
ఎన్ఎంయూ నేతలు సిబ్బంది కుదింపు, గ్రాట్యూటీ తగ్గింపు, అద్దె బస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 22 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.