telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ap logo

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 59,697 మంది, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తామని తెలిపింది. డిసెంబర్ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

Related posts