డీఎంకే నేత దొరై మురుగన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు 25 నిముషాలపాటు ఇరువురు చర్చలు జరిపారు. నిన్న సాయంత్రం స్టాలిన్, కేసీఆర్ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు దొరై మురుగన్ వివరించినట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ను కేసీఆర్ కోరారు. అయితే తాము కాంగ్రెస్ వైపే ఉంటామని, అవసరమైతే మీరు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలంటూ కేసీఆర్కు స్టాలిన్ సూచించారని వార్తలొచ్చాయి.
కేసీఆర్తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలో ఒక ప్రకటన చేశారు. దేశంలో మూడో ఫ్రంట్కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. మరోవైపు గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి జాతీయ స్థాయిలో టీడీపీ, డీఎంకే పోరాడుతున్నాయి. పలు అంశాల్లో డీఎంకేకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య కేసీఆర్తో భేటీ ముగిసిన తెల్లారే దొరై మురుగున్ను అమరావతికి స్టాలిన్ పంపారు. నిజానికి మూడో కూటమిపై స్టాలిన్కు మొదటి నుంచి ఆసక్తి లేదు.
గతంలో థర్డ్ ఫ్రంట్ ప్రయోగం రెండు సార్లు విఫలం కావడంతో స్టాలిన్ ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్న చంద్రబాబుతో సంబంధాలు కొనసాగించాలని స్టాలిన్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే దొరై మురుగన్ను అమరావతికి పంపారు.
విధి ఎవరినీ విడిచిపెట్టదు..అందరి సరదా తీర్చేస్తుంది- రోజా