telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అక్కడ గూండాలు నాపై దాడికి దిగారు : రేవతి

తనపై వస్తున్నా దుష్ప్రచారాలు వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి ఖండించారు.  టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లే ప్రయత్నం చేశానని అనడం అవాస్తవం అని అన్నారు.  లోకల్ రిజిస్ట్రేషన్ ఉన్న తన వాహనంకు ఫ్రీ పాస్ ఉందని, అలాగే ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉందని అన్నారు.  నిత్యం అదే టోల్ ప్లాజా మీదుగానే ప్రయాణం చేస్తున్నానని అన్నారు.  నిన్నటి రోజున ఇంట్లో మెట్లమీది నుంచి తన అమ్మ జారిపడ్డారని, ఆమెను అత్యవసరంగా చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గుంటూరు నుంచి కారులో బయలుదేరినట్టు రేవతిచెప్పారు.  కాజా టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఫుల్ గా ఉండటంతో పక్కనుంచి వెళ్లే ప్రయత్నం చేసినట్టు ఆమె పేర్కొన్నారు.  దీనిపై టోల్ ప్లాజా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే తన పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ సివిల్ డ్రెస్ లో ఉన్న టోల్ ప్లాజా గూండాలు తనపై దాడికి దిగారని ఆమె పేర్కొన్నారు.  మహిళా అని కూడా చూడకుండా అరగంటపాటు తనపై దౌర్జన్యం చేశారని, తన డ్రైవర్ ను కించపరిచేలా మాట్లాడారని రేవతి పేర్కొన్నారు.  అరగంటపాటు వారు చేసిన దౌర్జన్యానికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెడతానని ఆమె పేర్కొన్నారు. 

Related posts