తెలుగు రాష్ట్రాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులతో మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ నెల 20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినా, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది.
ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.