ఏపీ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. సొంత మేనేజ్మెంట్లలోనే అడ్హాక్ ప్రాతిపదికన వీటిని నిర్వహించాలని స్పష్టం చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఐదో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డీఈవో, ఆర్జేడీలకు సూచించారు. ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ప్రమోషన్ల షెడ్యూల్:
జూన్ 24 : తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రకటన
జూన్ 25-27 : అప్పీల్స్
జూన్ 28-29 : అప్పీల్స్ పరిశీలన
జూలై 1 : ఫైనల్ లిస్టు మరియు ఖాళీల జాబితా
జూలై 3 : హెచ్ఎంల ప్రమోషన్ల కోసం కౌన్సెలింగ్
జూలై 4-5 : స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్ హెచ్ఎంలకు కౌన్సెలింగ్
టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా: చంద్రబాబు