telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్: గవర్నర్ ఆమోదం

biswabhusan harichandan governor

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. కాగా, ఆర్డినెన్స్ ఆధారంగా ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ జీవో జారీ అయింది. ఈ జీవో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసింది.

‘కరోనా’ విపత్తు వల్ల జరిగే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించడం వల్లే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ తమకు అనుకూలంగా లేదని ప్రభుత్వం భావించడం వల్లే ఈ ఆర్డినెన్స్ జారీ చేసిందని ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Related posts