telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రిజిస్ట్రేషన్‌ శాఖలో నేటి నుంచి పెరిగిన రేట్లు అమలు

ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో స్టాంపులు, స్థలాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అధిక మార్కెట్‌ ధరలతో స్టాంపు రుసుం చెల్లించలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌ ధరలను పరిగణనలోకి తీసుకుంటూ మార్కెట్‌ ధరలు నిర్ణయించారు.

ఉన్నత స్థాయి అధికారులు 5 నుంచి 10 శాతం మేర భూములు, స్థలాలు మార్కట్‌ ధరలు పెంచి క్రయ విక్రయ దారులకు మరింత భారం మోపారు. ఆగష్టు 1 నుంచి భూములు, స్థలాల రేట్లు పెరుగుతున్నాయని తెలియగానే గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలన్నీ కిటకిటలాడాయి. స్టాంపు రుసుం భారం పడకుండా అప్పులు చేసి చేసి రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు.

Related posts