ఏపీ మంత్రి పేర్నినాని పోలీసులపై విరుచుకుపడ్డారు. కారు అడ్డుగా ఉంది తియ్యండి’ అన్నందుకు ..‘ఏం తమాషాలు చేస్తున్నా రా అంటూ కోపంతో ఊగిపోయారు.. మర్యాదగా ఉండదు..నా కారునే తియ్యమంటా రా అంటూ పోలీసులపై మంత్రి పేర్ని నాని చిందులు
వివరాల్లోకి వెళితే..
సీఎం జగన్ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో మంత్రి పేర్ని నాని కూడా సీఎంతో కలిసి వెళ్లారు. అయితే పోలీసులు మంత్రి కారు అడ్డంగా ఉందని.. దానిని పక్కకు తీయాలని ప్రొటోకాల్ సిబ్బంది కోరగా మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. అక్కడే మరికొన్ని కార్లు పార్క్ చేసి ఉండడంతో అవన్నీ ఎవరి కార్లు అంటూ పోలీసులను మంత్రి పేర్ని నాని నిలదీశారు.
తమాషాలు చేస్తున్నారా .. కారు తియ్యమంది ఎవడో రండి.. మంచి, మర్యాద ఉండదు.. అని అక్కడున్న పోలీస్ అధికారిని ప్రశ్నించారు. దానికి ఆ అధికారి ‘సార్ చెప్పింది చెప్పాం’ అని వివరిస్తుండగా… ‘ఒకడు చెప్పేది ఏంటయ్యా.. నేను ఈ జిల్లా ఇన్చార్జి మంత్రిని డిజిగ్నేషన్ ఏమిటో తెలుసా? గుర్తుపెట్టుకో.. ఇవాళ్టితో పండగ అయిపోదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఎస్పీ కార్లు, డీఐజీ కార్లు ఇక్కడ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. డిసిగ్నేషన్లు తక్కువ అయినవారి వాహనాలు అక్కడే ఉంచి.. తన కారు తీయమని చెప్పడంపై మండిపడ్డారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…