ఆంధప్రదేశ్ ఐసెట్,ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 29,904(92.53 శాతం).. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
విద్యార్థులు ఫలితాల కోసం sche.ap.gov.in లో చూడవచ్చు. ఇందుకు విద్యార్థులు వారి అడ్మిట్ కార్డు నంబర్, పాస్వర్డ్ నింపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.