telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిమ్మగడ్డకు ఝలక్ ఇచ్చిన జగన్‌ సర్కార్‌ !

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్‌ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. నిమ‌్మగడ్డ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ నిమ్మగడ్డ తగ్గేది లేదంటూ ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులపై వేటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డకు ఏపీ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ రిలీజ్‌ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఏపీ సర్కార్‌ తిప్పికొట్టింది. ఐఏఎస్‌ అధికారులపై ప్రొసీడింగ్స్‌ను జారీ చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని సీఎస్‌ పేషీ స్పష్టం చేశారు. అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా ప్రొసీడింగ్స్‌ను ఎవరూ జారీ చేయలేరని తెలిపింది ప్రభుత్వం. 

Related posts