telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లు, ఇద్దరు ఐపీఎస్ ల బదిలీ

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ లు, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెయిటింగ్ లో ఉన్న సతీశ్ చంద్రకు పోస్టింగ్ ఇచ్చింది. ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీశ్ చంద్రకు పోస్టింగ్ ఇచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇన్ ఛార్జిగా కె.కన్నబాబును నియమించారు.

ఐపీఎస్ అధికారి ఎన్.వి సురేంద్రబాబును ఎస్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. సురేంద్రబాబు ఇసుక అక్రమ తవ్వకాలు, ఎక్సైజ్ వ్యవహారాలు చూడనున్నారు. ఐపీఎస్ అధికారి త్రిపాఠిని డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జే.ఎస్.వి. ప్రసాద్ ను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Related posts