వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. బదీలీల కోసం ఎంతో కాలంగా ఎదిరిచూస్తున్న ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు పచ్చజెండా ఊపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఒకే చోట 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తొలుత ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. దీర్ఘకాలంగా బదీలీల కోసం ఎదురుచూస్తున్న ఆయా శాఖల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఇత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.