* ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదల
* ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స
ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్ ) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు పరీక్ష రాశారు. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఇంజనీరింగ్ ఎగ్జామ్కు 1,94,752, వ్యవసాయ పరీక్షకు 87,744 మంది విద్యార్థులు హాజరయ్యారు.
జూలై 4 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఈఏపీసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు పూర్తైన రెండు వారాల తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి.