ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లను మంగళవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 పరీక్షాకేంద్రాలు కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించామని చెప్పారు. ఇలా కేంద్రాలు మార్చిన విద్యార్థులకు మధ్యాహ్న సెషన్లో పరీక్ష రాసే అవకాశం కల్పించామని వివరించారు.
హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్మ్యాప్ ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని పేర్కొన్నారు. తెలంగాణలో పరీక్ష రాసే వారికి హైదరాబాద్లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్లలో కేంద్రాలను కేటాయించారు. ఇంజినీరింగ్ పరీక్ష ఈ నెల 20, 21, 22 తేదీల్లో 2 విడతలు, 23న ఉదయం ఒక విడత నిర్వహిస్తారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు 23 మధ్యాహ్నం, 24న 2 విడతలుగా నిర్వహిస్తారు.