పోలీసులకు కులం లేదని, తమది ఖాకీ కులం అని ఏపీ డీజీపీ ఠాకూర్ అన్నారు. డ్యూటీలో చేరిన రోజే కులాన్ని పక్కన పెడుతామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల భద్రత విషయంపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూ హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రమోషన్లపై జ్యుడీషియల్ స్క్రూటినీ ఉంటుందని, ఈసీ నుంచి రాత పూర్వకంగా వస్తే రిప్లే ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు. తన కులం ఇక్కడ ఎక్కడా లేదని, నిజాయితీగా పనిచేస్తున్నానని తెలిపారు. డీజీపీ ఠాకూర్ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో నిన్న జగన్ విమర్శించారు. కాగా సామాజికవర్గానికి చెందిన 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని నిన్న జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే డీజీపీ, ఇంటెలిజిన్స్ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
జగన్ తుగ్లక్ ను మించిన పరిపాలన అందిస్తున్నారు: దేవినేని