telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు: పుష్ప శ్రీవాణి

pushpa sreevani

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని బాబు అంటున్నారని, మీ కొడుకును ఓడించిన మంగళగిరి వెళ్లి అడగండన్నారు. 14 సీట్లలో 13 సీట్లలో ఓడించిన మీ సొంత జిల్లా చిత్తూరు వెళ్లి అడగండి, ఎందుకు ఒడిపోయారో చెప్తారని విమర్శలు గుప్పించారు.

పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి గిరిజనుల పట్ల చిత్తశుద్ధిని చాటు కున్నామన్నారు. మా ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపదారు. రాజకీయాల్లో సీనియర్‌ను అని చెప్పుకునే ఆయన ప్రజల్ని దారుణంగా మోసం చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 600 హామీలిచ్చి మాట తప్పారని, మహిళల్ని కించపరిచారని ఆమె విమర్శించారు.

Related posts