ఇవాళ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..అయితే..ఈ అరెస్ట్పై టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేసారు. ఆ విమర్శలకు మంత్రి ధర్మాన స్పందించారు. అచ్చెన్నాయుడు సొంత గ్రామంలోనే దౌర్జన్యానికి పాల్పడ్డారని మంత్రి ధర్మాన ఫైర్ అయ్యారు. అంతేకాదు… అచ్చెన్నాయుడి అరెస్ట్పై టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని…ఎన్నికలకు వైసీపీ ఎన్నడూ భయపడదని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన. టీడీపీ దౌర్జన్యాలు చేసి… వైసీపీపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజరంజక పాలన జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడి వైసీపీపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని.. పోలీసులను మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నారని తెలిపారు. అయితే ఏపీ పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు పోతున్నాయి. చూడాలి మరి ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.
previous post
ఏపీ కేబినేట్ మీటింగ్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..