telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్…

corona vairus

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.  నెల రోజుల క్రితం వేల సంఖ్యలో  కేసులు నమోదవుతుండేవి.  కానీ, ఇప్పుడు కేసులు వందలకు వరకు నమోదవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 664 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,70,076 కి చేరింది.  ఇందులో 8,56,320 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 6,742 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 11 మరణాలు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,014 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 29, చిత్తూరులో 105, తూర్పుగోదావరి జిల్లాలో 67, గుంటూరులో 72, కడపలో 21, కృష్ణాలో 105, కర్నూలులో 19, నెల్లూరులో 34, ప్రకాశంలో 40, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 73, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 70 కేసులు నమోదయ్యాయి.

Related posts