telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయం..

ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు.

రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని చెప్పారు.వార్షిక ఆదాయం రూ.18 లక్షల వరకు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించినట్లు చెప్పారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, కావలి, ప.గో. జిల్లా ఏలూరులో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమం అమలవుతుందన్నారు.

తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశార‌ని తెలిపారు.

అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు.మొత్తం సొమ్ము నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లు అందజేయడం జరుగుతుందన్నారు. పదిశాతం ముందుగా చెల్లిస్తే ఇంటి నిర్మాణం చేస్తామన్నారు. వాయిదాల్లో మిగతా సొమ్ము చెల్లింపు చేయవచ్చునన్నారు. అయితే డబ్బులు మొత్తం ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేట్‌ కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తాం..

వెబ్‌సైట్‌ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్‌ తెలిపారు. https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు .

అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు.

Related posts